Saturday, April 4, 2009

Natti kumar comments on allu aravind

మూడు లక్షలమంది సినిమా కార్మికులనే పట్టించుకోని వ్యక్తి, అంతకు నాలుగురెట్ల సంఖ్యలో ఉన్న అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారు? సినీ పరిశ్రమ స్లంపులో ఉన్నప్పుడు కార్మికుల వైపు కన్నెత్తి చూడని వ్యక్తి, పేద కార్మికులకు ఎడమచేత్తో ఎంగిలిమెతుకులు విదిలించని వ్యక్తి ఎంిపీగా ఎన్నికై ఎవరిని ఉద్ధరిస్తారు? చిరంజీవిపై ఉన్న అభిమానంతో రక్తదానంచేసి, మృతి చెందినవారి కుటుంబాలు రోడ్డుపాలైతే పట్టించుకోని వాళ్లు సామాజిక న్యాయం చేస్తారంటే నమ్మేదెవరు?' అని చిన్న నిర్మాతల సంఘం కన్వీనర్‌ నట్టి కుమార్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర క్రిస్టియన్‌ పోరాట సమితి అధ్యక్షుడుగా ఉన్న ఈయన చాలా ఏళ్ల క్రితం రాషా్టన్న్రి ఉర్రూతలూగించిన ముద్రగడ నేతృత్వంలోని కాపు పోరాటసమితికి కన్వీనర్‌గా వ్యవహరించారు.

రానున్న ఎన్నికల్లో అనకాపల్లి ప్రజలు స్థితప్రజ్ఞతతో వ్యవహరించి ఓటు వేయాలని, ముఖ్యంగా చిరు అభిమానులు తమకు అన్యాయం జరగడానికి కారకులెవరో గుర్తించి, బడుగుబలహీన వర్గాల కోసం కృషి చేస్తున్న వ్యక్తులను గెలిపించాలని నట్టికుమార్‌ కోరారు. శుక్రవారం ఆయన `సూర్య' ప్రధాన రాజకీయ ప్రతినిధితో మాట్లాడారు. ఆయన
ఏమన్నారంటే...

`వీళ్లు సొంత పరిశ్రమలోనే సామాజిక న్యాయాన్ని అమలు చేయలేదు. కానీ, పవన్‌కల్యాణ్‌, నాగబాబు సరైన విధానాలున్న వాళ్లు. సామాజిక న్యాయంచేసే శక్తి వాళ్లకే ఉంది. ఎప్పటికైనా పవన్‌ కల్యాణే పీఆర్పీ అధ్యక్షుడు. రేపటి ఎన్నికల్లో పీఆర్పీ ఓడిపోతే దానికి కారణం చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ కాదు. కచ్చితంగా అల్లు అరవిందే' అని స్పష్టం చేశారు.

చిరు కుటుంబాన్ని అరవింద్‌ గుప్పిట్లో పెట్టుకున్నారు

ఫ్యాన్‌‌సకు ఎన్నికల్లో టిక్కెట్ల గురించి, చిరు కుటుంబంపై అల్లు అరవింద్‌ పెత్తనం గురించి చెబుతూ నట్టికుమార్‌- `ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌‌సకు ఎన్ని టిక్కెట్లు ఇచ్చారో చెప్పే ధైర్యం ఉందా? ఉంటే అనకాపల్లిలో మీడియా ముందుకొచ్చి చెప్పే దమ్ముందా? సినిమాల్లో కాపు నిర్మాతకేమైనా చేశారా? నేనూ కాపునే! జూనియర్‌ ఎన్టీఆర్‌ తన నిర్మాత నష్టపోతే మళ్లీ సినిమాలిస్తున్నాడు. అంత పెద్ద మనసు వీళ్లకుందా? చిరంజీవి కేవలం ఒక బొమ్మ. ఆయనేం చేయాలో, ఏ సినిమాకు సైన్‌ చేయాలో, ఏ సినిమా చూడాలో కూడా చెప్పే అల్లు అరవింద్‌ చిరంజీవి కుటుంబాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. తన కొడుకు కోసం పవన్‌ను తొక్కిపెట్టారు' అని నట్టికుమార్‌ ఘాటుగా విమర్శించారు.

అనకాపల్లికి ఏం చేస్తారని అడిగా

`మా పరిశ్రమకు చెందిన అల్లు అరవింద్‌ అనకాపల్లి నుంచి ఎంపిగా పోటీ చేస్తున్నారు కాబట్టి, ఆయనకు మద్దతునివ్వాలని కొందరు నా దగ్గరకొచ్చారు. అయితే, వాళ్లను నేను కొన్ని ప్రశ్నలడిగా. 3 లక్షల మంది ఉన్న మన పరిశ్రమ కార్మికులు, టెక్నీషియన్లకు ఎలాంటి సాయం చేయని వ్యక్తి అంతకు నాలుగురెట్ల జనాభా ఉన్న అనకాపల్లి ప్రజలకు ఏం చేయగలరని ప్రశ్నించా. ఆ కుటుంబం పెరిగింది అభిమానుల రక్తమాంసాలతో.

సొంత సినిమాకోసం టిక్కెట్ల రేట్లు పెంచి అభిమానుల జేబులు గుల్లచేసిన వాళ్లు కనీసం ఒక్క అభిమానికయినా ఎన్నికల్లో టిక్కెట్‌ ఇచ్చారా అని అడిగా. చిరంజీవి, అల్లు కోట్లు సంపాదించారు. గత 20 ఏళ్లలో రాష్ట్రంలో తుపాను, వరదలు వస్తే ఆ కుటుంబం నయాపైసా సాయం చేసిందా? తెలుగుప్రజలు కొన్న టిక్కెట్ల డబ్బుతో కోటీశ్వరులైన చిరంజీవి, అల్లు నయాపైసా ఇచ్చారా? సామాజిక న్యాయం గురించి చెబుతున్న ఈ పెద్దమనుషులు ఇప్పటివరకూ పరిశ్రమలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలనెవరినైనా తమ గుమ్మంలోకి రానిచ్చారా అని అడిగా. పోనీ, మిమ్మల్నయినా రానిచ్చారా అని ప్రశ్నిస్తే ఎవరూ జవాబు చెప్పలేదు.

అల్లు అరవింద్‌ దెబ్బ తీశారు

అభిమానులను అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించిన వాళ్లు అదే అభిమానులు తమకోసం చనిపోతే కనీస సాయం చేయడానికే మనసురాని వాళ్లు ఎంిపీగా గెలిచి ఏం ఉద్ధరిస్తారు? పవన్‌ కల్యాణ్‌, నాగబాబుకు నాయకత్వ లక్షణాలున్నా, వారిని అల్లు ఎదగనివ్వలేదు. సినిమాల్లో కూడా పవన్‌ను ఎదగనివ్వలేదు. గజిని సినిమా పవన్‌ చేస్తానన్నా ఆయనకివ్వలేదు. ఆయన వ్యక్తిగత వ్యవహారాన్ని రచ్చకెక్కించింది ఎవరో కూడా పరిశ్రమలో అందరికీ తెలుసు' అని నట్టికుమార్‌ వివరించారు.

అల్లును అడగండి

`అనకాపల్లి ప్రజలు, చిరంజీవి అభిమానులు అల్లును ఒకటే ప్రశ్న అడగాలి. మీరు గెలిస్తే హైదరాబాద్‌లోని ఏిసీ రూముల్లో ఉంటారా? ఇక్కడ ఉంటారా?-అని. అభిమానుల కష్టంతో సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకుని కోట్లు సంపాదించుకుని మాకేం చేశారో చెప్పమని నిలదీయండి. ఒక్క అభిమానికయినా సీటిచ్చారా అని ప్రశ్నించండి. చిరు కోసం ప్రాణాలర్పించిన అభిమానుల కుటుంబాలకు ఏం సాయం చేశారో చెప్పమనండి. చిరంజీవి కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు కూడబెట్టిన ఈయన ఏనాడైనా తన కులానికి గానీ, బీసీలకు గానీ ఏమైనా సాయం చేశారో చెప్పమనండి.

చిన్న నిర్మాతల పొట్టకొట్టారు

అల్లు పూర్తిగా బిజినెస్‌మేన్‌. థియేటర్ల లీజు వ్యవహారంలో చిన్న నిర్మాతల పొట్టగొట్టారు. మేమంతా నిరాహారదీక్ష చేస్తే ఒక రాజకీయపార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన కనీసం పలకరించలేదు. సొంత పరిశ్రమనే గౌరవించని వ్యక్తి, నియో జకవర్గ ప్రజలను ఏం గౌరవిస్తారు? ఇప్పటికయినా మించి పోయింది లేదు. చిరంజీవి ఆయనను పక్కకుపెట్టక పోతే పార్టీకి భవిష్యత్తు లేదు. పవన్‌ను ప్రోత్సహిస్తే యువతతో పాటు, కాపు వర్గం కూడా పీఆర్పీ వెంట ఉంటుంది. ఇప్పుడు అల్లు వల్ల పార్టీకి కాపులు కూడా దూరమవుతున్నారు. ఆయనను ఓడించేందుకు ఎక్కడెక్కడో ఉన్న కాపులంతా ఒక్కటవుతున్నారంటే పరిస్థితి గ్రహించాలి' అన్నారు నట్టికుమార్‌.

కాపులు చిరును, అల్లును చూసి ఓటేస్తారా?

`కాపులంతా చిరంజీవి, అల్లును చూసి పీఆర్పీకి ఓటు వేస్తారంటున్నారు. ఇది పసలేని వాదం. మేము ముద్రగడ నాయకత్వంలో కాపులకు రిజర్వేషన్ల గురించి పోరాడుతున్నప్పుడు చిరంజీవి, అల్లు మంచి స్థానంలో ఉన్నారు. అప్పుడు మద్దతు కూడా ప్రకటించలేదు. అది వదిలేయండి. కాపు నేత రంగా హత్యను వీళ్లిద్దరూ కనీసం ఖండించలేదు. వారి కుటుంబాన్ని పరామర్శించలేదు. మరి కాపులు వీళ్లకు ఎలా మద్దతిస్తారు. నేను కొద్దినెలల క్రితం పీఆర్పీ గాలి వీస్తోందని మా వారికి చెప్పా. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు ఎన్నిసీట్లు వస్తాయన్న అనుమానం మొదలయింది. ఇదంతా స్వయంకృతమే ' అన్నారాయన.

ఆరోజేం జరిగిందంటే...

`మేమంతా ఓసారి సారథి స్టుడియోలో ముఠామేస్త్రీ షూటింగులో ఉన్నాం. అప్పుడు చిరంజీవి తాను ఇక్కడ షూటింగ్‌ చేయనని, చెనై్నలో మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. దీనికి ఆ సమయంలో ఆ సినిమాలో నటిస్తున్న శ్రీహరి, నిర్మాత కె.సి. శేఖర్‌బాబు సాక్ష్యం. చివరకు వీళ్ల ఇన్‌కంటాక్‌‌స లెక్కలు కూడా చెనై్నలోనే ఉన్నాయి. అంటే వీళ్లకు రాష్ట్రంపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌ మంచి మనసు

తమవల్ల నష్టపోయిన నిర్మాతలకు చిన్నవాడైనా జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలిస్తున్నాడు. వాళ్లకేమైనా సమస్యలొస్తే దగ్గరుండి మరీ సినిమా రిలీజ్‌ చేయిస్తున్నాడు. వీళ్లకు ఆ హృదయం ఏదీ? ముఖ్యమంత్రులే చిరంజీవి కోసం ఎదురుచూసే స్థాయికి తీసుకువెళ్లిన అభిమానులకు అప్పుడే ఏమీ చేయలేని చిరంజీవి, ముఖ్యమంత్రయితే ఏదో చేస్తారని భావించడం అవివేకమే.

ఇప్పుడైనా కళ్లు తెరవాలి

చిరంజీవి సోదరులైన కల్యాణ్‌, నాగబాబు, వారి కుటుంబసభ్యులతో పాటు, అభిమానులను ఒకటే కోరుతున్నా. మీరంతా ఇప్పటికయినా కళ్లు తెరవండి. చిరు పక్కదారి పట్టడానికి కారకులను పక్కకుపెట్టకపోతే, ఆ తర్వాత ఎంత బాధపడ్డా ఫలితం లేదు. ఇప్పటికే సినిమాల్లో డిస్ట్రిబ్యూషన్ల మాదిరిగా రాజకీయాల్లోనూ టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలతో పీఆర్పీ భ్రష్టుపట్టింది. అటు అభిమానులు, ఇటు కాపు వర్గం కూడా దూరమవుతున్నారు. చివరకు కాపు ఉద్యమాలు నడిపిన సీనియర్లు కూడా పక్కదారిపడుతున్న చిరంజీవిని హెచ్చరిస్తున్నారు. ఎవరినైతే చూసి బలమని భావిస్తున్నారో ఆ బలమే బలహీనమయి, తిరుగుబాటుచేస్తోంది. కేవలం డబ్బుకోసమే రాజకీయాల్లో కి వచ్చామకుంటే సినిమాల మాదిరిగానే చిరంజీవి బొమ్మను పెట్టుకుని బిజినెస్‌ చేసుకోండి. లేకపోతే పీఆర్పీని పవన్‌ కల్యాణ్‌కు అప్పగించండి' అని నట్టికుమార్‌ విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment