Saturday, April 4, 2009

Chiru files nomination at thirupathi along with Charan

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రజారాజ్యం అధినేత చిరంజీవి శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ సందర్భంగా పీఆర్పీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఆర్డీవో ఆఫీస్‌ ముందు పీఆర్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతకు ముందు చిరు బీపారంను తనయుడు రామ్‌చరణ్‌ తిరుమలలో స్వామివారి పాదలవద్ద ఉంచి తీసుకువచ్చారు. చిరంజీవి కాన్వాయిలో మీడియా వాహనం అదుపుతప్పింది. అయితే మీడియా ప్రతినిధులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు

No comments:

Post a Comment