Saturday, April 4, 2009

ticket aspirants shows anguish on Prajarajyam

పార్టీ పుట్టి నవ మాసాలైనా నిండలేదు. పోలింగ్‌ సింబల్‌ వచ్చి నెలైనా గడవలేదు. ప్రజారాజ్యం పార్టీ కోట అప్పుడే బీటలు వారుతోంది. పార్టీ శ్రేణులను ఎన్నికల సమరాంగణానికి సిద్ధం చేసుకోవాల్సిన తరుణంలోనే సొంత సేనల నుంచి తిరుగుబాట్లతో ఆపార్టీ కుదేలవుతోంది. పార్టీ కార్యవర్గంలో ఉన్న అగ్రనేతల్లో లుకలుకలు బయటపడుతున్నాయి. శాసనసభ, లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి పాతర వేశారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. అగ్రనేతలు పార్టీ వైపు కన్నెత్తయినా చూడకుండా ముఖం చాటేస్తు న్నారు. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలను ఎదుర్కొనేందుకు ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవి తాను ఎంచుకున్న వ్యూహం తనకే బెడిసి కొడుతోంది. నామినేషన్ల పర్వానికి కొన్ని గంటలే గడువు ఉండగా, మరో వైపు వివిధ నియోజకవర్గాల్లో పార్టీ నేత నుండి పుట్టుకొస్తున్న నిరసన జ్వాలలతో పార్టీ అధిష్ఠానంకు చెమటలు పడుతున్నాయి.
పార్టీ జెండా భుజాల కెత్తుకుని నెలల తరబడి మోసిన వారికి టిక్కెట్లు దక్కక పోగా కొద్ది గంటల్లోనే ప్లేటు ఫిరాయించి పార్టీ గుమ్మంలోకి అడుగు పెట్టిపెట్టకముందే పాతవారిని పక్కన పెట్టి కొత్త వారికి అగ్రతాంబూలం ఇవ్వడంతో కార్యకర్తలు ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. పార్టీ కోసం తన వృత్తిని సైతం త్యాగం చేసి పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర వహించిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సమ రంను పక్కన పెట్టడంతో ఆయన కలత చెందారు. పార్టీ కోసం పని చేసిన వారి కంటే నిన్న మొన్న వచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని, లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో లోఫర్లకు, డాఫర్లకు టిక్కెట్లు ఇచ్చారంటూ ఆయన మండిపడుతు న్నారు. పార్టీ అధికారికి కార్యక్రమాలన్నింటినీ భుజాలకెత్తుకుని తన వాగ్ధాటితో ఇతర పార్టీలను ముచ్చెమటలు పట్టిస్తూ వచ్చిన పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సైతం అలక బూనారు.
టిక్కెట్టు ఆశించి భంగపడ్డ పద్మ పిఆర్‌పికి రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. పార్టీ ప్రారంభంలోనే తెలుగు దేశంను వీడి ప్రజారాజ్యంలో చేరిన కోటగిరి విద్యాధరరావు సైతం మనస్థా పానికి గురయినట్లు సమాచారం. తాను కోరుకున్న ఉంగుటూరు, పోలర వంతోపాటు దెందులూరు, చింతలపూడి, నిడదివోలు టిక్కెట్లను తన అనుచ …రులకు ఇప్పించుకోవడంలో విఫలమైన కోటగిరి పార్టీకి రాజీనామా చేసే యోచ నలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజారాజ్యంలో మహిళారాజ్యం అధ్యక్ష బాధ్యతను నెత్తిన మోస్తూ పార్టీపై ఈగ వాలకుండా తన వాగ్ధాటితో కాపాడు కుంటూ వచ్చిన శోభారాణి సైతం అలకబూనారు. పార్టీలో ఇప్పటికే ఆమెను కరివేపాకులా వాడుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గన్నవరం టిక్కెట్టుపై తన ఆశలు ఫలించకపోవడంతో కారెం శివాజీ కూడా మనస్థాపం చెందినట్లు సమాచారం.

పార్టీకి గుర్తుగా రైలుఇంజన్‌ను తనే సాధించి పెట్టినట్లు గా ప్రచారం చేసుకుంటున్న చనుమోలు రాజీవ్‌, ఆయన భార్య లక్ష్మికి ఎంపి, టిక్కెట్లు కట్టబెట్టడం పట్ల పార్టీ వర్గాల్లోనే తీవ్రమైన అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ఐఎఎస్‌ అధికార హోదాను సైతం తృణప్రాయంగా వదిలేసి పార్టీ సేవలకే ఉపయోగపడుతూ వచ్చిన కెఎస్‌ఆర్‌మూర్తి తొలి నుంచి అమలాపురం పార్ల మెంటు స్థానంపై ఆశలు పెంచుకుంటూ వచ్చారు. అయితే అక్కడ కెఎస్‌ఆర్‌ మూర్తిని కాదని ప్రమీలారాణికి ప్రాధాన్యత నివ్వడంతో ఆయనకూడా అసం తృప్తితో ఉన్నారు. అనకాపల్లి టిక్కెట్టుపై ఆశలు పెట్టుకున్న మరో ఐఎఎస్‌ అధికారి కెవి.రావుకు కూడా మొండిచెయ్యే చూపారు. ప్రజారాజ్యంపార్టీకి తన భవనాన్ని కార్యాలయం కింద నజరానాగా ఇచ్చిన తోట చంద్రశేఖర్‌కు గుంటూరు ఎంపి టిక్కెట్టు ఇవ్వడం పట్ల కూడా అసమ్మతి సెగ రగులుతోంది.

అగ్రనేతల్లో లుకలుకలు

మరో వైపు పార్టీ అగ్రనేతల్లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే డాక్టర్‌ మిత్రాకు అధిష్టానం ప్రాధాన్యత తగ్గించింది. పవన్‌కళ్యాన్‌, చిరంజీ విలతో మిత్రా మధ్య మాటలు కరువైనట్లు సమాచారం. పార్టీ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ పరకాల ప్రభాకర్‌ కూడా అధిష్టానం పట్ల కినుక వహించారు. పార్టీ అగ్రనేతలు శివశంకర్‌, చేగొండి హరిరామజోగయ్య సైతం పార్టీ వ్యవహారాల పట్ల అంటీముట్టనట్టే ఉంటున్నారు. ఇప్పటికే పార్టీ కోసం ఎన్నో వ్యయ ప్రయా సలకోర్చిన గొట్టిముక్కల పద్మారావు, దిలీప్‌ వంటి వారెంతో మంది అధిష్టానంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చిరంజీవి అభిమానులు కూడా తమ ఫ్యాన్‌‌సకు ఎక్కడా స్థానం కల్పించకపోవడంతో రగిలిపోతున్నారు. చిరంజీవి ఫ్యాన్‌‌స రాష్ర్త అధ్యక్షులు చెనమలశెట్టి వెంకటేశ్వర్లు 17 జిల్లాల ఫ్యాన్‌‌సతో శుక్రవారం నాడు సమావేశమై పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. రెండో విడత ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లో ఫ్యాన్‌‌స చేత నామినేషన్లు వేయించనున్నట్లు వెల్లడించారు.

``మాదిగలు ఎక్కువగా వున్న వేమూరులో `కత్తి'కు టిక్కెట్‌ ఎలా ఇస్తారు? ఏ సామాజికన్యాయం ప్రకారం టిక్కెట్లిస్తున్నారు''

- శోభారాణి


``కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేకుండా పోయింది. టిక్కెట్ల పంపిణీలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి''

-వాసిరెడ్డి పద్మ


``పార్టీ ఆవిర్భవించిన నాటినుంచి అహర్నిశలు శ్రమించిన వారిని కాదని లోఫర్లకు, డాఫర్లకు టిక్కెట్లు ఇవ్వడం దారుణం''

-డాక్టర్‌ సమరం

No comments:

Post a Comment