Saturday, April 4, 2009
Vasi reddy padhma stays with Prajarajyam
ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అలకపాన్పు దిగారు. కృష్టాజిల్లా నందిగామ ఎమ్మెల్యే టికెట్ను తన భర్త వెస్లీకి కేటాయించనందుకు పార్టీ అధిష్ఠానం వైఖరిపట్ల అసంతృప్తి చెందారు. ఒక దశలో పార్టీకి గుడ్బై చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే శనివారం పద్మ మీడియాతో మాట్లాడారు... ఎట్టి పరిస్థితుల్లోను ప్రజారాజ్యం పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను ఆవేదన మాత్రమే వ్యక్తం చేశానన్నారు. పార్టీ తరుపున ప్రచారం చేస్తానని పద్మ తేల్చిచెప్పారు.
Labels:
AP Elections news,
chiranjeevi,
Pawan Kalyan,
prajarajyam,
PRP
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment