మాజీ మంత్రి, ప్రజారాజ్యం పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన కోట గిరి విద్యాధరరావు అభ్యర్థుల ఎంపిక పట్ల అసం తృప్తితో పార్టీకి రాజీనామా చేసినట్లు, ఏలూరులో రహస్య సమావేశం నిర్వహించినట్లు వదంతులు వచ్చాయి. ఇదే విషయం శుక్రవారం పాలకొల్లు విలేఖర్ల సమావేశంలో పాల్గొన్న చిరంజీవిని ప్రశ్నించగా ఆయన ఒక్కసారిగా కంగుతిన్నారు. కొద్ది సేపు షాక్కు గురైన ఆయన `అది ఏమిలేదే... మధ్యాహ్నం వరకు నా దగ్గరే ఉన్నారు. నా నామినేషన్ పత్రాల పై సంతకం పెట్టడానికి ఆయన పెన్ (కలం) కూడా ఇచ్చారు. శనివారం ఉంగుటూరులో తన నామినేషన్కు ఏర్పాట్లు చేసుకుంటానని చెప్పి వెళ్ళారు. కానీ మీరు చెబుతున్నది ఆశ్చర్యంగా ఉంది' అని అన్నారు. పక్కనే ఉన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వెంటనే ప్రచార వాహనంలోకి వెళ్ళి కోటగిరితో ఫోన్లో మాట్లాడి వెంటనే మీడియా సమావేశంలో ఉన్న చిరంజీవితో మాట్లాడాలని చెప్పారు.
చిరంజీవి మీడియా సమావేశాన్ని ముగించి ప్రచార వాహనంలోకి వెళ్ళి, ఒక్క క్షణంలోనే బయటకు వచ్చి `ప్రెస్ ఫ్రెండ్స..... ప్లీజ్ వెయిట్' అనుకుంటూ బస్సు లోంచి సెల్ఫోన్తో వచ్చి కోటగిరి విద్యాధరరావు తో పాత్రికేయుల, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స విలేకర్ల సమక్షంలో మాట్లాడారు. `కోటగిరి విద్యాధ రరావు ప్రజారాజ్యం పార్టీకి మూలస్ధంభమని, అటువంటి ఆయన రాజీనామా చేశారని వదంతు లు రావడం ఏమిటని, ఇదిగో లైన్లో ఉన్నారు. విద్యాధరరావుగారు మాట్లాడతారు వినండి' అని చిరంజీవి అన్నారు. ఫోన్లో విద్యాధరరావు మాట్లా డుతూ `ప్రజారాజ్యం పార్టీ నాదని, నేను రాజీనా మా చేయడం ఏమిటని, ఇదంతా ఎవరో సృష్టించా రని, నమ్మవద్దని' అన్నారు. చిరంజీవి పదేపదే కోటగిరి ఈ పార్టీకి మూలస్తంభమని, సీట్ల పంపిణీలో ఆయనకు అసంతృప్తి ఏమిలేదని చెప్పారు.
పీఆర్పీలో చేరిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్
పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం శాసన సభ్యులు గ్రంథి శ్రీనివాస్ శుక్రవారం పాలకొల్లులో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరోసారి మొండి చేయి చూపి టిక్కెట్ ఇవ్వని కారణంగా ఇటీవలే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. అందరూ ఊహించినట్లుగానే ఆయన ప్రజారాజ్యంలో చేరారు. కాగా ఆయన భీమవరం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ప్రజారాజ్యం తరపున నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆయనను గ్రంధి వెంకటరత్నం బలపరిచారు.
Saturday, April 4, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment