Saturday, April 4, 2009
Pawan speaks about tickets
పార్టీ టిక్కెట్లు అమ్ముకోవాల్సిన అవసరం తమకు లేదని ప్రముఖ సినీ నటుడు, యువరాజ్యం అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిక్కెట్ దక్కని వారంతా ప్రజారాజ్యంపై దుమ్మెత్తిపోస్తూ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో స్పందించారు. పార్టీలో అందరికీ టిక్కెట్లు ఇవ్వడం ఎవరికైనా సాధ్యం కాదన్నారు. ఆయా నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, గెలుపు అవకాశాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పదవుల కోసం కాకుండా సేవ కోసమే ఎవరైనా రాజకీయా లలోకి రావాలని ఆయన సూచించారు
Labels:
AP Elections news,
chiranjeevi,
Pawan Kalyan,
prajarajyam,
PRP
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment